10వ తేదీ వరకు పోస్టర్ బ్యాలెట్ ఓటుకు అవకాశం
ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు పోస్టర్ బ్యాలెన్స్ ద్వారా ఓటు వేసే అవకాశాన్ని 10వ తేదీ వరకు పొడిగించినట్లు రిటర్నింగ్ అధికారి వల్లూరు క్రాంతి బుధవారం తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు. కొత్తగా ఓటు నమోదు చేసుకుని అవకాశం లేదని పేర్కొన్నారు. నిర్ణీత సమయంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.