రేపు సిపిఎం విస్తృతస్థాయి సమావేశం
సిపిఎం జిల్లాస్థాయి విస్తృతస్థాయి సమావేశం ఈనెల 4వ తేదీన ఉదయం 11 గంటలకు సంగారెడ్డిలోని పీఎస్ఆర్ గార్డెన్ లో నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి జయరాజ్ శుక్రవారం తెలిపారు. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు మద్దతుపై సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. సమావేశానికి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కారాములు, డిసిసి అధ్యక్షురాలు నిర్మలారెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు.