రోడ్డుపై పారుతున్న మురుగునీరు.. వాహనదారులకు ఇబ్బంది
సంగారెడ్డి పట్టణం ఎస్పీ నివాసం వద్ద ప్రధాన రహదారిపై మురుగు నీరు బుధవారం రోడ్డుపై పారుతుంది. రోడ్డుపై మురుగు నీరు పారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మురుగు కాల్వను శుభ్రం చేయాల్సిన మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి మురుగు నీరు రోడ్డుపై పారకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.