వాసవి దేవాలయంలో కృత్తికా నక్షత్ర వేడుకలు

52చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో కృత్తికా నక్షత్ర వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. సౌజన్య నరేంద్ర దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేక, పూజా కార్యక్రమాలను జరిపించారు. మహిళలకు సామూహిక కుంకుమార్చన నిర్వహించి లలిత సహస్రనామ చదివారు. అనంతరం అమ్మవారి పల్లకి సేవా కార్యక్రమాన్ని జరిపించారు. దేవాల కమిటీ చైర్మన్ తోపాజి అనంత కృష్ణ, విద్యా సాగర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్