భద్రాచలంలో ఘనంగా రథసప్తమి వేడుకలు

66చూసినవారు
భద్రాచలంలో ఘనంగా రథసప్తమి వేడుకలు
భద్రాచలంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భద్రాచలం సీతారామచంద్రస్వామి వారిని బంగారు కవచాలతో అలంకరించారు. రథసప్తమిని పురస్కరించుకుని అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. దీంతో స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారి మూలమూర్తులను దర్శించుకుని పూజలు చేశారు. సాయంత్రం సూర్యప్రభ వాహన సేవపై ఆలయ తిరు వీధుల్లో అర్చకులు ఉరేగిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్