పండ్లలో రారాజైన మామిడి పండ్ల సీజన్ మొదలైంది. అయితే మామిడిపండ్లు వేగంగా పక్వానికి రావడానికి వ్యాపారులు క్యాల్షియ కార్బైడ్ ఇంజెక్షన్లు చేస్తారు. సహజంగా పండిన మామిడి పండ్లు పసుపు రంగులో ఉంటే రసాయనాలు ద్వారా పక్వానికి వచ్చిన వాటికి అక్కడక్కడా ఆకుపచ్చని మచ్చలు ఉంటాయి. అలాగే పండ్లను ఒక టబ్లో వేసి అవి మునిగే వరకూ నీళ్లు పోయాలి. సహజంగా పండివన్నీ అడుగు భాగానికి చేరుకుంటే, పైకి తేలేవి మాత్రం రసాయనాలతో పండినవి.