దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష లీకేజీపై చర్చ జరుగుతుందని BRS సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేర్కొన్నారు. బీహార్, గుజరాత్ రాష్ట్రాల నుంచి నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందనే వార్తలు వస్తున్నాయన్నారు. ఈ విషయంలో రూ. కోట్లు చేతులు మారాయని అంటున్నారని చెప్పారు మరి దీనిపై ఈడీ ఎందుకు కేసు నమోదు చేయడం లేదని వినోద్ కుమార్ ప్రశ్నించారు.