వైసీపీ గెలుస్తుందని రూ.కోట్లల్లో బెట్టింగ్.. చివరకు ఆత్మహత్య!

70చూసినవారు
వైసీపీ గెలుస్తుందని రూ.కోట్లల్లో బెట్టింగ్.. చివరకు ఆత్మహత్య!
ఏలూరు జిల్లా నూజివీడులో విషాదం చోటు చేసుకుంది. తూర్పుదిగవల్లి గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి (52) ఏడో వార్డు సభ్యుడిగా ఉన్నారు. ఆయన భార్య సర్పంచ్. వీరిద్దరూ వైసీపీ మద్దతుదారులు. ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని వేణుగోపాల్ రెడ్డి వివిధ గ్రామాలకు చెందిన వారితో రూ.30 కోట్ల వరకు బెట్టింగ్ కట్టాడు. అయితే వైసీపీ ఓడిపోవడంతో అప్పులు తీర్చలేక తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్