100 స్థానాల్లో శివసేన పోటీ: రామ్‌దాస్ కదమ్

73చూసినవారు
100 స్థానాల్లో శివసేన పోటీ: రామ్‌దాస్ కదమ్
మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాల్లో 100 స్థానాల్లో పోటీ చేస్తామని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన సీనియర్ నేత రాందాస్ కదమ్ అన్నారు. ముంబైలో మీడియాతో మాట్లాడారు. తాము పోటీ చేసే 100 స్థానాల్లో 90 గెలిచేలా ప్రణాళికలు చేపడుతున్నామన్నారు. అక్టోబర్‌లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ, షిండే నేతృత్వంలో శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూటమిగా ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్