కొరియర్ డెలివరీ సంస్థ బ్లూడార్ట్ దేశవ్యాప్తంగా డ్రోన్ల సేవలను ప్రారంభించింది. దీని కోసం డ్రోన్ టెక్నాలజీ సంస్థ స్కై ఎయిర్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఎక్స్ఛేంజీలకు కూడా తెలిపామని చెప్పింది. ఒకరోజులోనే డెలివరీ చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని సంస్థ ఓ ప్రకటనలో వివరించింది. 2021లో తెలంగాణలో ఔషధాలను డ్రోన్లద్వారా ప్రయోగాత్మకంగా డెలివరీ చేశామని గుర్తుచేసింది.