హైదరాబాద్లోని సీబీఐ కోర్టులో నేటి నుంచి వైసీపీ అధినేత జగన్పై ఉన్న కేసులు విచారణకు రానున్నాయి. నిన్నటి నుంచే కేసుల విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా, సీబీఐ న్యాయస్థానం న్యాయమూర్తి సెలవులో ఉండటంతో నేటికి కేసుల విచారణ వాయిదా పడింది. మొత్తం 11 సీబీఐ కేసులపై ఈ కోర్టు విచారణ చేపట్టనుందని న్యాయవాదులు తెలిపారు. జగన్పై నమోదు చేసిన 9 ED కేసులపై విచారణ జరగనుంది.