కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ కేరళలో టూర్ చేశారు. ఈ సందర్భంగా మలప్పురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాని మోదీ తృటిలో ఓటమి నుంచి తప్పించుకున్నట్లు చెప్పారు. అయోధ్యలో బీజేపీ ఓడిపోయిందని, ద్వేషం.. హింసకు చోటు లేదని అయోధ్య ప్రజలు సందేశాన్ని ఇచ్చినట్లు పేర్కొన్నారు. మోదీ నియంతృత్వ పోకడలు చెల్లవని కేరళ, యూపీ రాష్ట్రాల ప్రజలు నిరూపించినట్లు రాహుల్ గాంధీ తెలిపారు.