బోట్ యూజర్లకు షాక్!

51చూసినవారు
బోట్ యూజర్లకు షాక్!
ప్రముఖ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ బోట్‌కు సంబంధించి ఫోర్బ్స్ ఇండియా సంచలన రిపోర్ట్ వెల్లడించింది. ఈ సంస్థ నుంచి స్మార్ట్‌వాచ్, హెడ్‌ఫోన్స్ వంటి గ్యాడ్జెట్లు కొన్న 75 లక్షల మందికిపైగా కస్టమర్ల పర్సనల్ డేటా లీకైనట్లు తెలిపింది. 'షాపిఫైగై' అనే హ్యాకర్ ఈ డేటాను డార్క్ వెబ్‌లో లీక్ చేసినట్లు పేర్కొంది. ఇందులో కస్టమర్ల పేర్లు, ఈమెయిల్స్, ఫోన్ నంబర్లు, కస్టమర్ ఐడీలు మొదలైన వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్