వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేజీ సీఎన్జీపై రూ.1 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచే కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. నేషనల్ కేపిటల్ రీజియన్ (ఎన్సీఆర్), ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది.