షాకింగ్.. రైల్వే ట్రాక్‌పై 10 సింహాలు

534చూసినవారు
షాకింగ్.. రైల్వే ట్రాక్‌పై 10 సింహాలు
రైలు వేగంగా వెళ్తోన్న సమయంలో ట్రాక్‌పైకి ఒకేసారి పది సింహాలు వచ్చిన ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. గుజరాత్‌లోని పిపావావ్‌ పోర్టు స్టేషన్‌ నుంచి గూడ్స్‌ రైలు వెళ్తోంది. ఆ క్రమంలో ట్రాక్‌పై 10 సింహాలు సేదతీరుతున్నట్లు లోకో పైలట్‌ ముకేశ్‌ కుమార్‌ మీనా గుర్తించారు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. అవి పట్టాల నుంచి లేచి దూరంగా వెళ్లే వరకు అతడు వేచిచూశాడు. అనంతరం రైలు బయలుదేరింది. మీనా చేసిన పనికి అధికారుల నుంచి ప్రశంసలు లభించాయి.

సంబంధిత పోస్ట్