షాకింగ్: ఛార్జింగ్ పెట్టి నిద్ర.. షాక్ కొట్టి యువకుడు మృతి

75చూసినవారు
షాకింగ్: ఛార్జింగ్ పెట్టి నిద్ర.. షాక్ కొట్టి యువకుడు మృతి
TG: నిజామాబాద్ జిల్లాలోని సదాశివనగర్‌లో విషాద ఘటన జరిగింది. ఓ యువకుడు మొబైల్‌కు ఛార్జింగ్ పెట్టి నిద్రపోయాడు. సాకెట్ దూరంగా ఉండటంతో ఎక్స్టెన్సన్ బాక్స్‌ పక్కనే పెట్టుకుని.. ఛార్జింగ్ పెట్టి నిద్రపోయాడు. నిద్రలో కాలు వేయడంతో షాక్ కొట్టి చనిపోయాడు. మృతుడిని యాచారం తండాకు చెందిన అనిల్‌గా పోలీసులు గుర్తించారు. అనిల్‌కు భార్య, ఏడాదిన్నర కూతురు ఉంది. దీంతో మృతుడి కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి.

సంబంధిత పోస్ట్