అక్బర్ పేట భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామంలో సోమవారం సాయంత్రం గ్రామంలోని రైతులకు ఎలుగుబంటి కనిపించిందన్న సమాచారంతో మంగళవారం ఉదయం అటవీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ఎలుగుబంటి కాలిముద్రలను సేకరించారు. కొన్ని రోజులు వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లే రైతులు ఒంటరిగా వెళ్లొద్దని, అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారి శ్రీనివాస్ సూచించారు.