నాలుగు మాసాల పాలనలో తెలంగాణ ప్రజలకు పాలేవో, నీళ్లేవో తెలిసిపోయిందని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి తెలిపారు. తొగుటలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ. కేసీఆర్ తెలంగాణ సాధించడంతో పాటు బీడు భూముల్లో గోదావరి నీళ్లను పారించాడన్నారు. ఇంటింటికి తాగునీళ్లు, రైతుబంధు, రైతు బీమా, రూ. 200 పింఛన్ 2000లకు పెంచడం జరిగిందన్నారు.