పెద్దశంకరంపేట మండలం మల్కాపూర్ గ్రామ చెరువులో మునిగి పల్లెపాటి వెంకటేశ్(25) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మండలం గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన వెంకటేశ్ 40 రోజుల క్రితం గ్రామానికి ఇల్లరికం వచ్చాడు. నిన్న సాయంత్రం చెరువులో స్నానం చేసేందుకు వెళ్లి JCB గుంతలో మునిగిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.