శబాష్ పోలీస్..మృతదేహం వెలికితీత

10615చూసినవారు
శబాష్ పోలీస్..మృతదేహం వెలికితీత
సిద్దిపేట రేణుక నగర్ కాలనీ ప్రక్కన ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లోని బావిలో పర్వతం కనకయ్య (30) అనే వ్యక్తి పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని బయటకు తీసేందుకు గజ ఈతగాళ్లు రూ.20వేలు అడిగినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ASI ఉమారెడ్డి ధైర్య సహసాలు ప్రదర్శించి స్వయంగా బావిలోకి దిగి మృతదేహాన్ని బయటకు తీశారు. ప్రజలు, కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులు ఆయన్ను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్