సిద్దిపేటకు చెందిన సుగుణ సాహితీ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది బాలలకథల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఈనెల 16న సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నగదు బహుమతుల ప్రదానం చేయనున్నట్లు సమితి కన్వీనర్ బైతి దుర్గయ్య ఆదివారం తెలిపారు. విజేతలకు జిల్లా విద్యాధికారి ఎల్లంకి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం చేస్తామన్నారు. అనంతరం బాలల కథల సంపుటి 'నక్షత్రకోట' పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతుందన్నారు.