తగ్గేదేలే..అంటున్న చికెన్ ధరలు

8228చూసినవారు
తగ్గేదేలే..అంటున్న చికెన్ ధరలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో చికెన్ కు డిమాండ్ పెరిగింది. నిన్న, మొన్నటి వరకు కిలో రూ. 220 నుంచి రూ. 250 వరకు ఉన్న చికెన్ ధర ఆదివారానికి ఒక్కసారిగా పెరిగింది. ప్రాంతం, డిమాండ్ ఆధారంగా కిలో చికెన్ రూ. 300 పైగానే విక్రయిస్తున్నారు. ఓ వైపు పండుగలు, మరో వైపు శుభకార్యాల సీజన్ కావటంతో చికెన్ వినియోగం గణనీయంగా పెరిగింది. వినియోగానికి తగిన విధంగా కోళ్ల ఉత్పత్తి లేకపోవటంతో ధరకు రెక్కలొచ్చాయి.

సంబంధిత పోస్ట్