బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం

56చూసినవారు
బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయ్యింది. స్థానికుల వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పెర మల్యాల గ్రామ శివారులో గల చెరువు కింద బావిలో శనివారం మృతదేహం కనబడడంతో పోలీసులకు సమాచారం అందించారు. వ్యక్తి గుర్తు పట్టరాని విధంగా ఉన్నాడని దాదాపు మూడు రోజులపైనే బావిలో పడి ఉంటాడని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్