ఘనంగా గౌతమ బుద్ధుడి జయంతి

75చూసినవారు
ధర్మారం మండల కేంద్రంలోని గౌతమ బుద్ధ ఫంక్షన్ హాల్ ఎదుట గౌతమ బుద్ధ జయంతిని మాజీ ఎంపీటీసీ బొల్లి స్వామి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. బుద్ధుని విగ్రహానికి పూలమాల వేసి అనంతరం బుల్లి స్వామి మాట్లాడారు. గౌతమ బుద్ధుని బోధనలు ప్రపంచానికే ఆదర్శ ప్రాయమని, ఆయన కారణజన్ముడని చెప్పారు. క్రీ. పూ. 623వ సంవత్సరంలో ఇప్పటి నేపాల్‌లోని లుంబినిలో ఒక రాజ కుటుంబంలో బుద్ధుడు జన్మించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్