రహదారిని త్వరితగతిన పూర్తి చేయాలి

57చూసినవారు
కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి జమ్మికుంటకు వెళ్లే రహదారి విస్తరణ పనులు నత్త నడకన కొనసాగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ మార్గంలో ప్రత్యే కించి వీణవంక మండల కేంద్రంతో పాటు కోర్కల్, కిష్టంపేట తదితర గ్రామాల్లో రోడ్డు విస్తరణ పనులు తీవ్ర ఇబ్బందిగా మారాయి. సుదీర్ఘ కాలమైన పనులు పూర్తి కాకపోవడంతో గుంతలరోడ్లపై ప్రయాణించడానికి నిత్యం నరకం అనుభవిస్తున్నారు. దుమ్ముధూళితో రోగాల పాలవుతున్నామని మంగళవారం ఆవేదన చెందారు.

సంబంధిత పోస్ట్