కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలంలోని వేంపేట గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఘనంగా శత చండి మహా సుదర్శన యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావుతో పాటు బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.