లోన్ ఇప్పిస్తానని చెప్పి నగదుతో పారిపోయిన మహిళ

31222చూసినవారు
లోన్ ఇప్పిస్తానని చెప్పి నగదుతో పారిపోయిన మహిళ
మహిళా సంఘ సభ్యులకు బ్యాంకు లోన్ పది లక్షల రూపాయలు ఇప్పించిన ఆర్ పి స్వర్ణలత అవే డబ్బులతో పరారైన సంఘటన మంగళ వారం కోరుట్లలో చోటు చేసుకుంది బాధితులు గురువారం పోలీసులను ఆశ్రయించగా ఈ ఘటన వెలుగు చూసింది. బ్యాంక్ కు వెళ్ళిన స్వర్ణలత ఇంకా రాకపోవడం తో ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని రావడం తో మహిళలు ఆందోళన చెందారు మహిళ సంఘాల సభ్యులు అందరూ కలిసి మునిసిపాలిటీ మెప్మ అధికారి జలెందర్ దృష్టికి తీసుకెళ్లగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్