నాగులపేటలో ఘనంగా బద్ది పోచమ్మ బోనాలు

1193చూసినవారు
కోరుట్ల మండలం నాగులపేట గ్రామంలో బద్ది పోచమ్మ తల్లికి బోనాలు ఘనంగా సమర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పోత రాజుల విన్యాసాలతో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని బద్ధి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ కేతీరెడ్డి భాస్కర్ రెడ్డి, ఉప సర్పంచ్ వసంత-స్వామి, పీఏసీఎస్ ఛైర్మన్ సింగిరెడ్డి నర్సారెడ్డి, నాగులమ్మ దేవాలయ ఛైర్మెన్ సింగిరెడ్డి నవీన్ రెడ్డి, కోశాధికారి బోదుకం నాగరాజు, కుల సంఘాల పెద్దలు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మ వారికి బోనాలు సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్