ఇబ్రహీంపట్నం మండలంలోని గోదూరు జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన నవ్య శ్రీ అనే విద్యార్థి రూపొందించిన అడిస్టబుల్ పోడియం అనే ఆవిష్కరణను ఈనెల 15, 16న జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రదర్శించింది. ఉత్తమ ప్రతిభ కనబరిచి రెండో స్థానంలో నిలవడంతో జాతీయ స్థాయి ప్రదర్శనకు నవ్య శ్రీ రూపొందించిన ఆవిష్కరణ ఎంపికైందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మధు తెలిపారు. నవ్య శ్రీని ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.