చెట్టుకు కారు ఢీ కొని ఒకరి మృతి.. ఐదుగురికి గాయాలు

36040చూసినవారు
చెట్టుకు కారు ఢీ కొని ఒకరి మృతి.. ఐదుగురికి గాయాలు
కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్తుండగా ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి వాసులు కారు లో కొండగట్టు వెళ్తుండగా కరీంనగర్ జిల్లా చిగురు మామిడి లోని ఎల్లమ్మ గుడి వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారు లో వున్న కొప్పు సుజాత అక్కడికక్కడే మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్