వర్షాలు సమృద్ధిగా కురవాలని కప్పతల్లి ఆట
By GOTTE ARJUN 72చూసినవారుశంకరపట్నం మండలం కన్నాపూర్ ధర్మారంలలో ఏరువాక పౌర్ణమినీ పురస్కరించుకొని వర్షాలు సమృద్ధిగా కురవాలని కప్పతల్లి ఆట ఆడారు. సర్పంచులు కాటం వెంకటరమణారెడ్డి చుక్కల రవి ఆధ్వర్యంలో శనివారం పలు దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి, ఆంజనేయస్వామి, పోచమ్మతల్లి, ఎల్లమ్మతల్లి, పెద్దమ్మతల్లి, కట్ట మైసమ్మ, దుర్గమ్మతల్లి, మల్లన్న స్వామి దేవాలయాల్లో జలాభిషేకాలు చేసి కప్పను చెరువులో వదిలారు.