బావిలో మునిగి విద్యార్ధి మృతి

30563చూసినవారు
బావిలో మునిగి విద్యార్ధి మృతి
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండి కాలనీలో సెయింట్ ఆంథోనీ స్కూల్ లో ఆదివారం ప్రమాదవశాత్తూ బావిలో మునిగి విద్యార్ధి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి శ్రీకర్ (14) 8వ తరగతి స్టూడెంట్. బావిలో ఉన్న చెత్తను తీయడానికి విద్యార్థులు దిగారని స్కూల్స్ సిబ్బంది చెబుతున్నారు. గల్లంతైన విద్యార్థి మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. ఈ ఘటనకు కారణమైన వార్డెనన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్