నేషనల్ ఎలిజిబిలిటి కం ఎంట్రన్స్ టెస్ట్– పిజి ప్రవేశ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ ఆదేశించారు. కలెక్టరేట్ లో శనివారం పిజి ప్రవేశ పరీక్ష నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. 23న ఉదయం 9 నుండి 12. 30 వరకు రామగిరి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశ పరీక్ష జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.