హంస వాహనంపై దర్శనమిచ్చిన అమ్మవారు

83చూసినవారు
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అయితే మొదటి రోజు గురువారం శైలపుత్రి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. సాయంత్రం పట్టణ పురవీధుల గుండా హంస వాహనంపై హరిహరులు విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివార్ల దివ్య రూపాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.

సంబంధిత పోస్ట్