గుజరాత్లోని రాజ్కోట్లో జరిగిన అగ్నిప్రమాదంపై అక్కడి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ ప్రమాదంపై విచారణ జరిపేందుకు సీఐడీ క్రైమ్ ఏడీజీపీ సుభాష్ త్రివేది నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన సిట్ బృందాన్ని నియమించింది. ఇందులో భాగంగా అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పలు శాంపిల్స్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 27 మంది మృతి చెందారు.