కుంభమేళాలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 60 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై ఉత్తర్ప్రదేశ్ మంత్రి సంజయ్ నిషాద్ భిన్నంగా స్పందించారు. భారీ సంఖ్యలో జనాలు వచ్చే ఇటువంటి కార్యక్రమాల్లో ఎక్కడో చోట చిన్న చిన్న ఘటనలు జరుగుతుంటాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నానని, భవిష్యత్తులో అటువంటివి జరగకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు.