తమిళనాడులోని తిరుచిరాపల్లి విమానాశ్రయంలో ఓ వ్యక్తి బంగారంతో పట్టుబడ్డాడు. దుబాయ్ నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి వద్ద నుంచి 977 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని సీజ్ చేశారు. అయితే ఆ బంగారాన్ని మూడు ప్యాకెట్లలో పురీషనాళం(ప్రైవేట్ పార్ట్)లో అతను దాచిపెట్టాడు. పేస్ట్ తరహాలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో దుబాయ్ నుంచి తిరుచ్చి విమానాశ్రయానికి అతను ప్రయాణించాడు.