ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా గెలవాలని భారత సీఆర్పీఎఫ్ జవాన్లు ఆకాక్షించారు. జమ్మూకాశ్మీర్లోని సీఆర్పీఎఫ్ జవాన్లు అందరూ భారత జెండాలను చేత పట్టుకుని మ్యాచ్ను టీవీలో తిలకిస్తూ టీమిండియాకు తమ మద్దతు తెలిపారు. రెట్టింపు ఉత్సాహంతో ఇండియా గెలుస్తుంది అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.