ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా స్టార్ బౌలర్ షమీ కాసేపు మైదానాన్ని వీడి డగౌట్కి వెళ్లారు. బౌలింగ్ వేస్తున్న సమయంలో కాలి మడమ నొప్పితో షమీ ఇబ్బంది పడ్డారు. దీంతో డగౌట్కి వెళ్లి కాసేపటి తర్వాత తిరిగి వచ్చారు. ఆ సమయంలో వాషింగ్టన్ సుందర్ సబ్స్టిట్యూట్గా మైదానంలోకి వచ్చారు.