AP: మద్యం మత్తులో తల్లిని చంపిన కుమారుడు

26160చూసినవారు
AP: మద్యం మత్తులో తల్లిని చంపిన కుమారుడు
ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా ఏ.కొండూరు మండలంలో దారుణం జరిగింది. వల్లంపట్ల గ్రామంలో మద్యం మత్తులో తల్లి బుజ్జమ్మను కుమారుడు వెంకటేశ్‌ దాడిచేసి చంపేశాడు. భార్యతో గొడవపడుతున్న క్రమంలో కుమారుడిని తల్లి బుజ్జమ్మ మందలించింది. ఈ క్రమంలోనే ఆవేశంతో ఊగిపోయిన వెంకటేష్.. తల్లిని దారుణంగా చంపాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్