గుజరాత్ లోని సూరత్లో హృదయ విదారక సంఘటన జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కౌన్సిలర్ జితేంద్ర కచాడియా కుమారుడు 17 ఏళ్ల అగ్నిప్రమాదంలో చిక్కుకుని మృతి చెందాడు. మృతుడు 12వ తరగతి చదువుతున్న ప్రిన్స్ కచాడియాగా గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అకస్మాత్తుగా వారింట్లో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో వారి కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి.