ఏపీలోని కర్నూలు జిల్లాకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని, జూన్ 5న తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు, రేపు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లా, మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని, మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది.