IPL-2025లో భాగంగా గురువారం KKRతో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 80 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై SRH కెప్టెన్ కమిన్స్ వ్యాఖ్యలు చేశారు. తమ ఫీల్డింగ్ వైఫల్యమే కొంపముంచిందని అన్నారు. బ్యాటింగ్, బౌలింగ్లో ఫర్వాలేదు కానీ, మైదానంలో ఇంకాస్త చురుగ్గా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఫీల్డింగ్లో క్యాచ్లు వదిలేయడం మమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టిందని వ్యాఖ్యానించారు.