భారత్పై విధించిన పరస్పర సుంకాన్ని అమెరికా 1 శాతం తగ్గించింది. భారత దిగుమతులపై ట్రంప్ ప్రభుత్వం 27 శాతం సుంకం విధించినట్లు వైట్హౌస్ పత్రం బుధవారం పేర్కొంది. అయితే, శుక్రవారం ఈ సుంకాన్ని 26 శాతానికి కుదించినట్లు వివరించింది. శాతం పరంగా ఇది చాలా తక్కువే అయినా విలువ పరంగా ఎక్కువ. ఇది భారత్కు కాస్త ఊరట కలిగించే అంశం.