బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొట్టిన శ్రీలంక.. అఫ్గానిస్థాన్పై అలవోకగా వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో లంక 155 పరుగుల తేడాతో అఫ్గాన్పై గెలిచింది. మొదట లంక 50 ఓవర్లలో 308 రన్స్ చేసింది. చరిత అసలంక (97*), కుషాల్ మెండిస్ (61), సదీర (52), జనిత్ (50) రాణించారు. అనంతరం అఫ్గాన్ 33.5 ఓవర్లలో 153 పరుగులకే చేతులెత్తేసింది. ఇబ్రహీం జద్రాన్ (54), రహ్మత్ షా (63) మాత్రమే ఆకట్టుకున్నారు.