అఫ్గాన్‌ను చిత్తుచేసిన లంక.. వన్డే సిరీస్‌ కైవసం

72చూసినవారు
అఫ్గాన్‌ను చిత్తుచేసిన లంక.. వన్డే సిరీస్‌ కైవసం
బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అదరగొట్టిన శ్రీలంక.. అఫ్గానిస్థాన్‌పై అలవోకగా వన్డే సిరీస్‌ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో లంక 155 పరుగుల తేడాతో అఫ్గాన్‌పై గెలిచింది. మొదట లంక 50 ఓవర్లలో 308 రన్స్‌ చేసింది. చరిత అసలంక (97*), కుషాల్‌ మెండిస్‌ (61), సదీర (52), జనిత్‌ (50) రాణించారు. అనంతరం అఫ్గాన్‌ 33.5 ఓవర్లలో 153 పరుగులకే చేతులెత్తేసింది. ఇబ్రహీం జద్రాన్‌ (54), రహ్మత్‌ షా (63) మాత్రమే ఆకట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్