థియేటర్‌లో ఉక్కపోత.. యాజమాన్యానికి జరిమానా

67చూసినవారు
థియేటర్‌లో ఉక్కపోత.. యాజమాన్యానికి జరిమానా
ప్రేక్షకుడిని అసౌకర్యానికి గురిచేసినందుకు హైదరాబాద్‌లోని ముక్త ఏ2 సినిమాస్‌కు వినియోగదారుల కమిషన్ జరిమానా వేసింది. 2023లో నిష్ఫర్ అనే వ్యక్తి సినిమాకు వెళ్లారు. ఏసీ, ఫ్యాన్ పనిచేయట్లేదని థియేటర్‌ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. సరైన స్పందన రాకపోవడంతో వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వాదనలు విన్న కమిషన్‌ ఆ వ్యక్తికి టికెట్ డబ్బులు, రూ.3 వేలు, కేసు ఖర్చులకు రూ.1,000 ఇవ్వాలని యాజమాన్యాన్ని ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్