నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

55చూసినవారు
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 81,923.99 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 82,137.77 వద్ద గరిష్ఠాన్ని తాకింది. తర్వాత నష్టాల్లోకి జారుకున్న సూచీ.. ఇంట్రాడేలో 80,726.06 కద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 638.45 పాయింట్ల నష్టంతో 81,050 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 218.85 పాయింట్ల నష్టంతో 24,795.75 వద్ద స్థిరపడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్