దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 180 పాయింట్లు లాభపడి 72,650 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 22,066 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.31 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్-30 సూచీలో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.