లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
By Somaraju 62చూసినవారుదేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 204 పాయింట్ల లాభంతో 76,810.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 75.95 పాయింట్ల లాభంతో 23,398.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.55గా ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, ఎల్అండ్టీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. హిందుస్థాన్ యూనిలీవర్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టపోయాయి.