కీలక డాక్యుమెంట్లు మాయం చేశారని ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ, ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డిపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా.. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వాసుదేవరెడ్డి వేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు ఈనెల 18కి వాయిదా వేసింది. అయితే, ఈలోపు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది.